Parliament : జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి . ఈ సమావేశాల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్, అర్జున్రామ్ మేఘవాల్లు హాజరయ్యారు.
Parliament : జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి . ఈ సమావేశాల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్, అర్జున్రామ్ మేఘవాల్లు హాజరయ్యారు.
మల్లికార్జున ఖర్గే తరఫున హాజరైన కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయయాత్ర’ సందర్భంగా అస్సాంలో జరిగిన ఘర్షణను ఈ భేటీలో లేవనెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ వంటి నేతలను సీఐడీ లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు.
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంటరీ సమావేశాలు ఇవే. లోక్సభ ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ప్రతి పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.