EPAPER

Amit Shah: లోక్ సభ యుద్ధం.. ప్రజాస్వామ్య కూటమి రాజవంశ కూటమి మధ్యే..

Amit Shah: లోక్ సభ యుద్ధం.. ప్రజాస్వామ్య కూటమి రాజవంశ కూటమి మధ్యే..
Amit Shah attacking INDI Alliance

Amit Shah: వచ్చే లోక్‌సభ ఎన్నికలు ప్రజాస్వామ్యం, అభివృద్ధి వర్సెస్ వంశపారంపర్య పార్టీల పోరు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కాంగ్రెస్ ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


రెండు రోజుల బీజేపీ జాతీయ మండలి రెండో తీర్మానాన్ని సమర్పించిన షా, “తమ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని తీసుకురాలేని వారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా పెంచుతారు? ప్రజాస్వామ్య, అభివృద్ధి కూటమికి, రాజవంశ కూటమికి మధ్య పోరు జరుగుతోంది’ అని షా అన్నారు.

ఇండియా కూటమి నాయకులందరికీ తమ కుమారులు, కూతుళ్లను ప్రధాని లేదా సీఎం చేయడమే ఏకైక లక్ష్యం అని ఆయన అన్నారు. “ఈ లక్ష్యం ఉన్న వారు అసలు పేదల కోసం కానీ దేశం కోసం పనిచేయగలరా? ఇవి 2G లేదా 3G పార్టీలు, అంటే రెండవ లేదా మూడవ జనరేషన్ పార్టీలు. ఈ పార్టీలలో ప్రతిభావంతులు, కష్టపడి పనిచేసేవారు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. బీజేపీ కూడా వారిలా వంశపారంపర్యంగా ఉండి ఉంటే, టీ అమ్మే వ్యక్తి ఎప్పటికీ ప్రధాని అయ్యేవాడు కాదు’ అని షా అన్నారు.


Read More: బీజేపీ కీలక నిర్ణయం.. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు..

“మోదీది చాలా పేద కుటుంబం; ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పేద ఆదివాసీ కుటుంబం నుండి వచ్చారు. ఉపరాష్ట్రపతి రైతు కుటుంబం నుంచి వచ్చారు. మా పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా మార్చుకున్నాం. వంశపారంపర్య పార్టీలు దేశం సంక్షేమాన్ని ఎప్పటికీ నిర్ధారించలేవు; మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే చేయగలదు’ అని ఆయన అన్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికలను కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణించిన షా, దేశం “రాజవంశ ఇండియా కూటమి” దేశానికి కట్టుబడి ఉన్న ఎన్‌డీఏ మధ్య ఎంచుకోవాలని అన్నారు. ప్రజలు “అవినీతి, బుజ్జగింపులను ఇష్టపడే ఇండియా కూటమి” ఎన్‌డీఏ మధ్య ఎంచుకోవాలని ఆయన అన్నారు.

“కాంగ్రెస్ అవినీతికి జనక్ (తండ్రి). దానిని ఆ పార్టీ పోషించింది,” అని షా అన్నారు, యూపీఏ రోజులలో.. అంతకుముందు కాంగ్రెస్ ఆరోపణలు చేసిన స్కామ్‌ల పేర్లను బయటపెట్టారు. “భూమి, సముద్రం లేదా అంతరిక్షం నుంచి కాంగ్రెస్ ప్రతిచోటా అవినీతి చేసింది. పదేళ్లలో మోదీపై ప్రత్యర్థులు ఒక్క పైసా అవినీతి ఆరోపణలు చేయలేకపోయారు’ అని షా అన్నారు.

ప్రధానమంత్రి పదవిలో నరేంద్ర మోదీ అనుసరించిన విధానాన్ని హోంమంత్రి ప్రశంసించారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని సామూహిక న్యూనతా కాంప్లెక్స్, బానిస మనస్తత్వం నుంచి విముక్తి చేసారు, ఇది స్వాతంత్ర్యం సమయంలో జరగాల్సినది” అని షా అన్నారు, మోదీ 3.0 కింద, దేశం ఉగ్రవాదం, నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని అన్నారు.

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×