India Covid Update: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. జేఎన్ 1 వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 636 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4394కు చేరింది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మృతి చెందగా.. మృతుల సంఖ్య 5,33,364కు చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశంలో 548 మంది కరోనా నుంచి కోలుకోవడంతో.. రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 98.8 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. ఆదివారం విడుదల చేసిన రిపోర్ట్ లో 841 కొత్తకేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ 9 రాష్ట్రాల్లో జేఎన్1 వేరియంట్ కేసులు 47కి చేరాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులుండగా.. కేరళలో 41 కేసులు నమోదయ్యాయి.