Sculptor Arun Yogiraj : అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వేళ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భూమ్మీద తన కంటే అదృష్టవంతులు ఎవరూలేరని సంతోషం వ్యక్తం చేశారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఇదంతా కలలా అనిపిస్తుందంటూ ఆనందపడ్డారు.
అయోధ్య మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం ముగ్గురు శిల్పులు వేర్వేలు రాముడి విగ్రహాలను తయారు చేశారు. అయితే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ఎంపిక చేశారు. ఈ విగ్రహామనే అయోధ్య రామమందిరంలో కొలువుతీరింది. మిగిలిన ఇద్దరు శిల్పులు తయారీ చేసిన రాముడి విగ్రహాలను కూడా ఆలయంలోనే పెడతారు.
రామ్లల్లాగా పిలిచే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. అంటే దాదాపు 4.25 అడుగులు. ఆకర్షణీయమైన కృష్ణశిలతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు రాముడిపై ప్రసరించే విధంగా విగ్రహాన్ని రూపొందించారు.