EPAPER

Akhilesh Yadav: అయోధ్య లైంగిక వేధింపుల ఘటనపై బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: అయోధ్య లైంగిక వేధింపుల ఘటనపై బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav:అయోధ్యలో బాలికపై సాముహిక లైంగిక దాడి కేసులో బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు కుట్ర రాజకీయాలకు తెరలేపాలని బీజేపీ కోరుకుంటుందని తెలిపారు. తొలి నుంచి సోషలిస్టులు ముఖ్యంగా ముస్లింల పట్ల బీజేపీ వ్యవహారశైలి అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.


ఒక యోగి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకుంటే ఆయన యోగి కాలేరని తెలిపారు. ఇక ఈ ఘటనపై అఖిలేష్ గతంలోనే యోగి సర్కార్‌పై మండిపడ్డారు. సాముహిక లైంగిక దాడిలో బాధితురాలికి రక్షణ కల్పించేలా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని అఖిలేష్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసును బీజేపీ నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బాలిక జీవితాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Also Read: సినిమా స్టయిల్‌లో.. 60 కిలోమీటర్ల భారీ ఛేజింగ్, సీఈఓ అరెస్ట్


అంతే కాకుండా కేసు సున్నితత్వం దృష్ట్యా కోర్టు పర్యవేక్షణలో బాలికకు పూర్తి భద్రత కల్పించాలని న్యాయస్థానాన్ని తాను కోరుతున్నానని ఎక్స్ వేధికగా పోస్టు చేశారు. అయోధ్యలో ఇటీవల 12 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి జులై 30 వ తేదీన బేకరీ యజమాని మొయిద్ ఖాన్‌తో పాటు ఉద్యోగి రాజు ఖాన్‌లను పురకలందర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. కాగా నిందితులు ఎస్పీ నేతలు, కార్యకర్తలు కావడంతో వారిని కాపాడేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని కాషాయ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×