EPAPER

Accident : ట్రక్కును ఢీకొట్టిన షిర్డీ యాత్రికుల బస్సు..10 మంది మృతి..

Accident : ట్రక్కును ఢీకొట్టిన షిర్డీ యాత్రికుల బస్సు..10 మంది మృతి..

Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీ యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.


ఠాణె జిల్లా నుంచి యాత్రికులతో ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు షిర్డీకి బయల్దేరింది. శుక్రవారం ఉదయం నాసిక్‌-షిర్డీ హైవేపై ఈ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నాసిక్‌ – షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండేతీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×