Manish Sisodia: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు తమ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇద్దరూ రాజీనామా పత్రాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సమర్పించారు. వారి రాజీనామాలను కేజ్రీవాల్ ఆమోదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయి సీబీఐ కస్టడీలో ఉండగా.. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రజైన్ జైలులో ఉన్నారు. వారిద్దరి రాజీనామాతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం ఢిల్లీ కేభినెట్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు.