EPAPER

Swati Maliwal : ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ కు రాజ్యసభ ఛాన్స్ .. అభ్యర్థిగా ఎంపిక చేసిన ఆప్..

Swati Maliwal: ఢిల్లీ తో పాటు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో నాలుగు స్థానాలకు జనవరి 19న రాజ్యసభ ఎన్నికలు ఎలక్షన్ కమీషన్ నిర్వహించనుంది. ముగ్గురు అభ్యర్థులను ఈ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నామినేట్‌ చేసింది. ఢీల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ అభ్యర్థిగా ప్రకటించిన పేర్లలో ఉన్నారు . స్వాతి మాలీవాల్ ను తమ అభ్యర్థిగా నామినేట్‌ చేస్తున్నట్లు పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రకటించింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జనవరి 2న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నెల 9వ తేదీలోగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలి.

Swati Maliwal :  ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ కు రాజ్యసభ ఛాన్స్ .. అభ్యర్థిగా ఎంపిక చేసిన ఆప్..

Swati Maliwal: రాజ్యసభ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ పేరు కూడా ఉంది. ఆమె రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రకటించింది. ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జనవరి 19న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 2న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీలోగా అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలి.


ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు సుశీల్‌ కుమార్‌ గుప్తా, సంజయ్‌ సింగ్‌, నారాయణ్‌ దాస్‌ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 27తో ఈ ముగ్గురి పదవీకాలం ముగియనుంది. సంజయ్‌ సింగ్‌, నారాయణ్‌ దాస్‌ గుప్తాకు మరోసారి రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు.

ఈ ఏడాది చివర్లో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపే లక్ష్యంగా సుశీల్‌ కుమార్‌ గుప్తాకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన స్థానంలో స్వాతి మాలివాల్‌ను ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే సంజయ్‌ సింగ్‌ మనీలాండరింగ్‌ కేసులో ఇటీవలే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. దీంతో తాను రెండోసారి రాజ్యసభకు వెళ్లేందుకు వీలుగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పేపర్లు‌పై సంతకం చేసేందుకు తనను అనుమతించేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం అతనికి అనుమతి ఇచ్చింది.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×