Aadhaar-Pan: ఆధార్-పాన్ లింక్ చేసుకోవాలని కేంద్రం ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తుదిగడువును పొడిగించింది. అయినా కూడా కొందరు లింక్ చేసుకోలేదు. ఈక్రమంలో వారికి కేంద్రం మరో ఛాన్స్ ఇచ్చింది. ఆధార్తో పాన్ అనుసంధానానికి గడువు మరో మూడు నెలలు పొడిగించింది.
అయితే ఇంతకముందు కేంద్రం ప్రకటించిన విధంగా మార్చి 31తో గడువు ముగుస్తుంది. కానీ చాలా మంది ఇంకా లింక్ చేసుకోకపోవడంతో గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఇక ఎవరైతే ఈ గడువులోగా ఆధార్తో పాన్ అనుసంధానం చేసుకోరో వారి పాన్ కార్డు ఇకపై పనిచేయదు.
లింక్ చేసుకోని వారు జులై 1 తర్వాత బ్యాంక్ ఖాతాలను, డీమ్యాట్ అకౌంట్లను ఓపెన్ చేయలేరు. అలాగే పాన్ కార్డు ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అందుకే తప్పనిసరిగా తుది గడువు ముగిసే లోగా లింక్ చేసుకోవాలని కేంద్ర సూచిస్తోంది.