EPAPER

Maoist Death: కంధమాల్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి..

Maoist Death: కంధమాల్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి..

Maoist Death: ఒడిశాలోని కంధమాల్ జిల్లా కాకేర్‌కుపా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టును ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దస్రుగా అధికారులు గుర్తించారు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి చెందిన కంధమాల్- కలహండి- బౌధ్- నాయగర్ (KKBN) డివిజన్‌ కమిటీ సభ్యుడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


దస్రుపై 5లక్షల రివార్డు సైతం తనపై ఉందిని తెలిపారు. భద్రతా దళాలపై దాడులు, అనేక సంఘటనలలో దస్రు పాల్గొనగా.. కంధమాల్‌, బౌద్‌ జిల్లాల్లో 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశాలోని ఎలైట్ యాంటీ నక్సల్ ఆపరేషన్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారి నేతృత్వంలో కంధమాల్ జిల్లా వాలంటరీ ఫోర్స్ కమాండోలతో కూడిన పోలీసు పార్టీ కాకేర్ కుపా ప్రాంతానికి వెళ్లగా.. అక్కడే ఎదురుకాల్పులు జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

ఈ కాల్పుల్లో ఓ పోలీస్‌ కూడా గాయపడ్డారని వెంటనే బెర్హంపూర్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటన ప్రాంతంలో ఒక 303 రైఫిల్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Tags

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×