Fire Broke Out in 2 School Buses in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ద్వారక సెక్టార్ 9లోని ఆర్డి రాజ్పాల్ పబ్లిక్ స్కూల్లో రెండు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో రెండు స్కూల్ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్కూల్ ఆవరణలో పార్కు చేసిన క్రమంలో రెండు బస్సుల్లోనే ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు ఘటన గురించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. స్కూల్ ఆవరణలోని పార్కింగ్ స్థలంలో రెండు బస్సులను పార్క్ చేసి ఉంచారు. సంఘటన జరిగిన సమయంలో బస్సుల్లో ఎవరు లేరని తెలిపారు.
వెంటనే ఘటన గురించి ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించగా. హుటాహుటీనా ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను చల్లార్పారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను చల్లార్పేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: Weather: దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది వర్షాలే.. వర్షాలు: ఐఎండీ
In Delhi's Dwarka Sector 9, a fire suddenly broke out in two school buses parked at R.D. Rajpal Public School. Around 2:30, the fire department was informed about the fire. 4 to 5 fire tenders have been dispatched to the scene to extinguish the fire. pic.twitter.com/AK3Dmuust2
— Atulkrishan (@iAtulKrishan1) April 14, 2024