EPAPER

Punjab Car Accident: వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు.. 9 మంది మృతి

Punjab Car Accident: వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు.. 9 మంది మృతి

Punjab Car Accident: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. బెజో ఖాడ్‌లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. వీరంతా హిమాచల్ ప్రదేశ్‌లోని ఉన్నా జిల్లా దేహ్లా గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. పంజాబ్‌లోని హిషియార్ పూర్ జిల్లా మహల్‌పూర్‌కు పెళ్లి కోసం వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న మార్గంలో కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారుతో పాటు అందులో ఉన్న వారంతా వరదలో కొట్టకుని పోయారు.


పంజాబ్‌లోని బెజో ఖాడ్‌లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారిలో 8 మంది మృతి చెందారు. కారుతో పాటు వారి మృతదేహాలను బయటకు తీసారు. మరో వ్యక్తి మృత దేహాం కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే కారు ప్రమాదంలో ఓ వ్యక్తి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు అతడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

Also Read: ట్రైన్‌లో మంటలు అంటూ ప్రచారం.. బ్రిడ్జీపై నుంచి దూకేసిన ప్రయాణికులు


ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుఖు, డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్ని హోత్రి సంతాపం వ్యక్తం చేశారు. సీఎం సుఖు.. హిమాచల్ ప్రదేశ్ – పంజాబ్ సరిహద్దు సమీపంలో బలమైన నీటి ప్రవాహం కారణంగా ఉన్నా జిల్లాలోని దేహ్లా గ్రామానికి చెందిన 9 మంది మృతి చెందారు. ఘటన గురించి స్థానిక అధికారులతో మాట్లాడుతున్నాను. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. చని పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాం అని ట్వీట్ చేశారు.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×