EPAPER

9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
Bihar Road accident
Bihar Road accident

9 People died in Bihar Road Accident: బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ట్రక్కు, జీపు, మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేగంగా వస్తున్న జీప్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది, రెండు వాహనాలు ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు.


“ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మందితో కూడిన జీపు.. మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. జీప్‌పై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఢీకొన్నట్లు తెలుస్తోంది” అని మోహానియా డీఎస్పీ దిలీప్‌కుమార్ తెలిపారు.

కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.


Read More: Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..

“కైమూర్‌లోని మోహానియా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం తన తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు” అని సీఎం కార్యాలయం ఆదివారం అర్థరాత్రి ప్రకటన విడుదల చేసింది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×