EPAPER

Ambala Road Accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు!

Ambala Road Accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు!
7 Died and 25 Injured in Ambala Road Accident: హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, 25 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అంబాలా ఆస్పత్రికి తరలించారు.

 


పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై వైష్ణో దేవికి యాత్రికులతో వెళ్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హర్యానాలోని అంబాలాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ నుంచి వైష్ణో దేవి దర్శనం కోసం వీరందరూ మినీబస్సులో వెళ్తున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి


ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొంతమందిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో తృటిలో తప్పించుకున్న కొందరు వ్యక్తులు తాము ప్రయాణిస్తున్న బస్సు కంటే ముందు ట్రక్కు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులకు వివరించారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×