7 killed in Multi-Storey Building Collapse In Surat: సూరత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సచిన్ ప్రాంతంలోని ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. శిథిలాల్లో పదుల సంఖ్యలో జనాలు చిక్కుకున్నారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. వారితోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికి తీయగా.. ఇంకా చాలా మంది వాటికింద చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద నుంచి ఓ మహిళను కాపాడినట్లు వారు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించడానికి సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ ఘటనాస్థలికి చేరుకున్నారు.
#WATCH | Gujarat: Surat DCP Rajesh Parmar says, "Rescue operation has been going on for 12 hours. One woman has been saved and 7 dead bodies have been recovered and sent for post-mortem… We are clearing the debris…" https://t.co/HVUp7jB6ro pic.twitter.com/609Qf7wYUt
— ANI (@ANI) July 7, 2024
ఆరంతుస్తల భవనంలో మొత్తం 30 ఫ్లాట్లు ఉన్నాయని.. అందులో కేవలం ఐదింట్లో మాత్రమే నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. కాగా ఈ భవనం 2016-17లో నిర్మించారని పేర్కొన్నారు. గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు భవనం కుప్పకూలిందని ప్రాథమికంగా నిర్దారించారు అధికారులు.