Chhattisgarh: అరుధైన వ్యాధితో బాధపడుతున్న బాలుడి చివరి కోరిక తీర్చేందుకు ఒక్కరోజు పోలీసుగా అధికారులు అవకాశం ఇచ్చిన ఘటనలు సినిమాల్లో, నిజజీవితంలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం నిజంగానే ఓ యూకేజీ స్టూడెంట్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలో చోటుచేసుకుంది.
రాజ్కుమార్ రాజ్వాడే అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించేవాడు. ఇటీవల అతడు విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈక్రమంలో పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద రాజ్కుమార్ ఉద్యోగాన్ని అతడి కుమారుడు నమాన్ రాజ్వాడేకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఈమేరకు యూకేజీ చదువుతున్న ఐదేళ్ల నమాన్కు కానిస్టేబుల్గా నియామక పత్రాన్ని అందజేశారు. ఆ బాలుడికి 18 ఏళ్లు పూర్తయిన తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. భర్త చనిపోయి బాధలో ఉన్నప్పటికీ… కొడుకుకు ఉద్యోగం రావడంతో నయాన్ తల్లి ఆనందం వ్యక్తం చేసింది.