Parliament : స్మోక్ బాంబ్ అంశం పార్లమెంట్ను కుదుపేస్తోంది. భద్రతా లోపంపై చర్చించాలని ప్రతిపక్షాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. లోక్సభలో మరో 49 మంది విపక్ష సభ్యులపై వేటు పడింది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. సోమవారం వరకు మొత్తం 92 మంది సస్పెండ్ అయ్యారు.
మరోవైపు శీతాకాల పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో భద్రతా లోపంపై చర్చించాలని ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో.. ఉభయ సభల నుంచి నిన్న 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది ఇండియా కూటమి.
మరోవైపు స్మోక్ బాంబ్ ఎటాక్పై హోంమంత్రి అమిత్షా, ప్రధాని మాట్లాడాలని, వివరణ ఇవ్వాలని పట్టు పడుతూ పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు విపక్ష నేతలు. రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా సస్పెన్షన్కు గురైన ఎంపీలంతా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ సర్కార్పై ఫైర్ అయ్యారు ఖర్గే. భద్రతా లోపాలపై చర్చించేందుకు హోం మంత్రి ఎందుకు సిద్ధంగా లేరని నిలదీశారు.
.
.