Kerala Stampede : కేరళలోని ఒక యూనివర్సిటీలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొచ్చిలోని యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్ క్యాంపస్లో జరిగిన ఒక టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో జరిగింది.
Kerala Stampede : కేరళలోని ఒక యూనివర్సిటీలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొచ్చిలోని యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్ క్యాంపస్లో జరిగిన ఒక టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను కలమస్సేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
యూనివర్సిటీ క్యాంపస్లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాత్రి 7 గంటలకు వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగింది. వర్షంలో తడవకుండా ఉండడానికి విద్యార్థులు లోపలి వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ లైవ్ కాన్సర్ట్ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు వచ్చారని స్థానిక మీడియా తెలిపింది.