18-year-old NEET aspirant Yuvraj missing in Kota : కోచింగ్ హబ్గా పేరొందిన రాజస్థాన్లోని కోటలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. విద్యార్థుల మిస్సింగ్ కేసులకు సంబందించి గత 7 రోజుల్లో ఇది రెండోది. సికార్ జిల్లాకు చెందిన యువ్రాజ్(18) ఇక్కడ ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో నీట్ మెడికల్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. కోటలోని ట్రాన్స్పోర్ట్ నగర్ ప్రాంతంలోని హాస్టల్లో ఉంటున్న యువ్రాజ్ శనివారం ఉదయం కోచింగ్ సెంటర్కు చేరుకున్నాడు.
Read more : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..
అప్పటి నుంచి అతని ఆచూకీ లేదు. అదీగాక అతను తన మొబైల్ ఫోన్ను హాస్టల్లో వదిలి రావడంతో అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది. వారం రోజుల క్రితమే రచిత్
సంధ్య(16) అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఆ విద్యార్థి జేఈఈకి సిద్ధమవుతున్నాడు. ఓ పరీక్షకు హాజరైన అనంతరం అతను ఓ క్యాబ్ ఎక్కడం సీసీటీవీ ఫుటేజిలో నమోదైంది.
ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదే చివరిసారిగా అతనిని చూడటం. ఆలయం వద్దే రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, గది తాళాలు, ఇతర వస్తువులు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ టీనేజర్ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. మిస్సింగ్ విద్యార్థుల కోసం గాలింపు సాగుతోంది.