Delhi liquor scam case :
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ ఇద్దరు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
నిందితులిద్దరికీ ఇంటి భోజనం తినేందుకు కోర్టు అనుమతించింది. వాటర్ ఫ్లాస్క్, రెండు జతల బట్టలు, చలి దుస్తులు, బూట్లు, అవసరమైన మందులు వాడేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. జైలులో ఇద్దరు నిందితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైనా విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది.