EPAPER

Assam Floods: కజిరంగ పార్క్‌ను ముంచెత్తిన వరదలు..131 వన్యప్రాణులు మృత్యువాత

Assam Floods: కజిరంగ పార్క్‌ను ముంచెత్తిన వరదలు..131 వన్యప్రాణులు మృత్యువాత

Assam Floods: అస్సాంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆరు లక్షల మందికి పైగా వరదల బారిని పడ్డారు. ఈ వరదల ధాటికి కజిరంగ పార్కులో 131 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లుగా అధికారులు వెల్లడించారు.


ఈ ఉదయం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. కజిరంగ పార్కులోని వరదలో ఓ ఖడ్గ మృగం చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వీడియో షేర్ చేశారు. దానిని వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరితో పాటు వన్యప్రాణుల ప్రాణాలు ప్రమాదాల్లో పడ్డాయని అన్నారు.

ఇక ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 131 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆరు ఖడ్గమృగాలు, 117 హాగ్ జింకలు, రెండు సాంబర్, ఒక మకాకు, ఇక ఒట్టర్ మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకు 97 వన్యప్రాణులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 25 వన్యప్రాణులు మెడికల్ కేర్‌లో ఉన్నాయని.. 52 వన్యప్రాణులను ట్రీట్‌మెంట్ తర్వాత విడిచిపెట్టామని అధికారులు తెలిపారు.

2017లో వరదల వల్ల దాదాపు 350 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి 24 గంటలు పని చేస్తున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం అన్నారు.

Tags

Related News

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

×