UP Road Accident: మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తున్న భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి చెరువులో పడటంతో 15 మంది మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనలపై ఆలిఘడ్ ఐజీ షలబ్ స్పందించారు. ఘటనలో 15మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నట్లు స్పష్టం చేశారు. రోడ్డు మీద ఉన్న కారును ఢీకొట్టకుండా ఉండేందుకు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను పక్కకి జరిపినట్లు చెప్పారు.
దీంతో ఆ వాహనం ఆ పక్కనే ఉన్న చెరువులో పడిపోయినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఘటనా స్థలంలో స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని , పరిస్థతిని సమీక్షించారు. చెరువులో దిగిన స్థానికులు మానవహారాన్ని ఏర్పాటు చేసి క్షతగాత్రులు, మృతి దేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుకుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించారు.
Tags
Share