Smart Pillow : సాధారణంగా ఊరెళ్లాలన్నా లేదా దూర ప్రయాణాలు చేయాలన్నా.. మొదటగా ఎదురయ్యే సమస్య మెడ నొప్పులు. అలాగని ప్రయాణాలు చేయకుండా ఉండలేం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లు ఈ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి నొప్పులకు ఓ స్మార్ట్ దిండు అందుబాటులో ఉంది. ‘స్లీప్’ కంపెనీ తయారు చేసిన ‘స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో’ అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది.
ఈ దిండులోని ప్రత్యేక ఫీచర్.. ‘మసాజ్’. ఈ దిండును మెడకు పెట్టుకుంటే చాలు.. అదే మర్ధన చేసి మెడ నొప్పులను మాయం చేస్తుంది. రక్త ప్రసరణను కూడా ప్రోత్సహిస్తుంది. దీనికున్న మరో ఫీచర్.. ‘హీట్ థెరపీ’. మెడకు సున్నితమైన వెచ్చదనాన్ని అందిస్తుంది. కండరాలపై ఒత్తిడిని తగ్గించి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. thesleepcompany.in వెబ్సైట్లో ఈ స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో రూ.1,999 ధరకే లభిస్తుంది.