EPAPER

Drinking Water : తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!

Drinking Water : తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!
drinking water
Drinking Water

Never Drinking Water : మనలో చాలా మంది భోజనానికి ముందు లేదా తిన్న తర్వాత నీళ్లు తాగుతుంటారు. కొందరికైతే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇలా తాగటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొన్ని ఆహారాలు తిన్న తర్వాత నీటిని తాగకపోవడమే మంచిది. మీరు కచ్చితంగా దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. తెలిసీ తెలియకుండా ఇటువంటి తప్పులు చేయకండి. ఇప్పుడు చెప్పుకునే ఆహారాలు ఆరోగ్యకరమైనప్పటికీ తిన్న తర్వాత నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


అన్నం తింటూ నీళ్లు తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి మంచి అలవాటు కాదు. ఆహారాన్ని తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. బియ్యంతో కూడిన ఏ ఆహారం తిన్నా ఇది పాటించాలి.

Read More : వేసవి వచ్చేసింది.. మీ ఆహారంలో ఈ మార్పులు చేయండి..!


మసాలా లేదా మసాలా ఫుడ్ తినే సమయంలో నీళ్లు తాగకూడదు. ఇది అనారోగ్యానికి గురి చేస్తుంది. మసాలా తిన్న తర్వాత నీరు తాగితే కడుపులో మంటగా అనిపిస్తుంది.

అరటిపండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే అజీర్ణ సమస్యలు వస్తాయి. అలానే జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. దీని కారణంగా కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అరటిపండు తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటే మానుకోండి.

పెరుగన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అయితే పెరుగన్నం తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిన్ కంటెంట్‌ను శరీరం గ్రహించదు. ఇది హృధా అవుతుంది. ఆహారం తినేప్పుడు పెరుగు తినండి కానీ, నీళ్లు మాత్రం తాగకండి.

పెరుగన్నం తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. ఇలా గ్యాప్ ఇవ్వండం వల్ల పెరుగులో ఉండే ప్రీబయోటిన్ మీ శరీరంలోకి చేరుతుంది. ప్రీబయోటిన్ మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Read More : త్వరగా తింటే ఏమోతుందో తెలుసా..?

ద్రాక్ష, నారింజ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్న వెంటనే నీరు తాగాల్సిన అవసరం లేదు. ఈ పండ్లను తాగి నీళ్లు తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటిని తిన్న తర్వాత కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగాలి. ఇది ఆరోగ్యకరమైన అలవాటు. ద్రాక్ష, నారింజ పండ్ల నుంచి పోషకాలు మీ శరీరానికి చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది.

Disclaimer : ఈ కథనం పలు వైద్య అధ్యాయనాలు, నిపుణుల సలహా మేరకు రూపొందించిన సమాచారం మాత్రమే.

Related News

Weight Gain Foods For Children: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

Aloe Vera Health Benefits: కలబందతో మతిపోయే ప్రయోజనాలు !

Lip Care Tips: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

Chana Dal For Diabeties: డయాబెటీస్ ఉన్నవారికి శనగపప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

Figs Side Effects: ఆరోగ్యానికి మంచిది అని అంజీర పండ్లను అతిగా తినేస్తున్నారా ?

Chia Seeds Benefits for Skin: చియా సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×