Gram Flour Benefits for glowing skin: శనగపిండిని కొన్ని దశాబ్దాలుగా చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. ఇది చర్మం అందగా కనిపించేందుకు, స్కిన్ గ్లో కోసం చాలా నమ్మకమైన పదార్ధం. శెనగపిండి చర్మానికి అప్లై చేయడం వల్లన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ రోజుల్లో చాలా మంది కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలలో మార్పులు వల్ల ప్రధానంగా చర్మ సంబంధిత సమస్యల ఎదుర్కొటుంన్నారు. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బయట మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. దాని వల్ల ఫలితం ఉండదు. పైగా చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంది.
కాబట్టి శనగపిండితో ఒసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. చర్మం మృదువుగా తయారువుతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. శనగపిండిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. శనగపిండి సహజమైన క్లెన్సర్ లాంటిది. ఇది చర్మం మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అదనపు నూనెను గ్రహించడంలో సహాయపడుతుంది. ముఖంపై ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న శనగపిండితో మీరు కూడా ఓసారి ముఖానికి అప్లై చేయండి.
శనగపిండి, దోసకాయ గుజ్జు, విటమిన్ ఇ కాప్యూల్స్
రెండు టేబుల్ స్పూన్ శనగపిండిలో దోసకాయ గుజ్జును కలిపి అందులో విటమిన్ ఇ కాప్యూల్స్ కలిపి మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. దోసకాయలో యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది.ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ శనగపిండిలో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత మఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
Also Read: మయోనైస్ తినేవారికి షాక్ ఇచ్చే విషయం, ఇది తెలిస్తే ఈరోజు నుంచి దాన్ని తినడమే మానేస్తారు
శనగపిండి, తేనె, నిమ్మరసం
శనగపిండిలో టీ స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి.
శగనపిండి, రోజ్ వాటర్
రెండు టేబుల్ స్పూన్ శనగపిండిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే మీ స్కిన్ కాంతివంతంగా మెరుస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.