Diabetes : ఒకసారి షుగర్ వచ్చిందంటే కోలుకోవడం దాదాపు అసాధ్యం. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు వ్యాయామం ద్వారా కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. రోజు రోజుకు వీరి సంఖ్య పెరిగిపోతుంది. మామూలుగా అయితే షుగర్ ఉన్నవారు తియ్యని పదార్థాల జోలికి వెళ్లరు. అలాగే మధుమేహం ఉన్నవారు అన్నాన్ని కూడా దూరం పెడతారు. మరికొందరు కేవలం ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తుంటారు. ఉదయం అల్పాహారం, రాత్రి డిన్నర్లో కూడా చిరుధాన్యలతో చేసిన ఆహారం తీసుకుంటారు. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, కొర్రలు, అవిసె గింజలు, అరికలు ఎక్కువగా తీసుకుంటారు.
అయితే మొక్కజొన్న విషయానికి వస్తే షుగర్ ఉన్నవాళ్లకి మంచిదే అయినా వాటితో చేసిన కార్న్ ఫ్లేక్స్ మాత్రం చాలా ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు. అందుకే షుగర్ ఉన్నవాళ్లు ఈ కార్న్ఫ్లేక్స్ జోలికి అస్సలు పోకూడదని హెచ్చరిస్తున్నారు. కార్న్ఫ్లేక్స్ చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చూడగానే తినాలనే కోరిక పుడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినకూడదని సూచిస్తున్నారు. వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. జీఐ ఉన్న ఆహారం తీసుకుంటే మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. మధుమేహం అదుపుతప్పుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే మధుమేహం ఉన్నవారు కార్న్ఫ్లేక్స్కు వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది.