బీఆర్ఎస్ లో అసంతృప్త జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. ఇవాళ తన అనుచరగణంతో భేటీ అవుతున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా బీఆర్ఎస్ నుంచి సంబంధాలు తెంచుకోక తప్పని పరిస్థితి కనిపిస్తుండడంతో.. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. మైనంపల్లితో పాటూ ఆయన కుమారుడు కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ దూపల్లిలోని తన నివాసంలో అనుచరులతో భేటీ కానున్నారు మైనంపల్లి హన్మంతరావు. ఈ సమావేశానికి అందరు హాజరు కావాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆయన సమాచారం కూడా అందించారు. మల్కాజ్ గిరితో పాటు మెదక్ కు నియోజకవర్గానికి చెందిన నేతలు, నాయకులకు కూడా ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది