Wipro: ఐటీ రంగంలో తొలగింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆర్థికమాంద్యం ఇప్పట్లో తొలగిపోయేటట్లు కనిపించడం లేదు. రోజూ ఏదో ఒక కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే 425 మంది ఫ్రెషర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించిన టెక్ దిగ్గజం విప్రో.. మిగతా ఫ్రెషర్లకు కూడా షాక్ ఇచ్చింది.
ఇటీవల విప్రో పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకుంది. ముందుగా వారికి రూ.6.5 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇక వారంతా ట్రైనింగ్ పూర్తి చేసుకొని మార్చిలో రోల్స్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో వారికి ఊహించని షాక్ ఇచ్చింది విప్రో. వారి ప్యాకేజీని రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఫ్రెషర్లకు ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుత ఆఫర్ను అంగీకరిస్తే.. ఇంతకముందు ఇచ్చిన ఆఫర్ రద్దవుతుందని మెయిల్లో పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో వెల్లడించింది. తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో సర్దుబాటు చేసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఫ్రెషర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ChatGPT:విమానం ఆలస్యం.. చాట్జీపీటీ ఏమందంటే?
Air India:ఏడాదికి రూ.2 కోట్లకు పైగా జీతం.. ఎవరికంటే?