Sankranthi Muggulu:సంక్రాంతి వేళ తెలుగు లోగిళ్ల ముత్యాల ముగ్గులతో కళకళలాడుతుంటాయి. రంగు రంగు ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పెడుతూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హిందువుల లోగిళ్లలోనూ ప్రాంగణాలోలనూ అలికి ముగ్గులు పెట్టడం తరతరాలుగు ఉన్నదే. సంక్రాంతికి గొబ్బెమ్మలు, పూలు.. ఇలా రమణీయంగా వుంటాయి ఇళ్లు ముంగిళ్లు. ఇలా ముగ్గులు వేయడానికి కారణం వుంది. మన భూమికి దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం నుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీనులు చెప్పారు. దక్షిణ దిక్కు యముడి దిక్కు భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు ఎప్పుడూ తిరుగుతూనే వుంటాయి.అవి ఇంట్లోకి ప్రవేశించకుండా వాకిలి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయాలి. ఇంట్లోకి వద్దామని వచ్చిన పిశాచం బియ్యపు పిండి తింటూ ఆ ముగ్గులోనే వుండిపోతుందని విశ్వాసం.
అందుకోసమే అప్పట్లో బియ్యపు పిండితో ముగ్గులు వేసే వారు. రాను రాను ప్రస్తుత కాలంలో రాళ్ల పిండితో ముగ్గులను వేస్తూ ఉండడం మొదలుపెట్టాం. బియ్యపు పిండితో ముగ్గులు పిశాచులు, రాక్షసుల నుంచి విముక్తి పొందడం కోసమే అని పండితులు చెబుతున్నారు. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి
నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గు లలో కూడా మనకు తెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!… యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.