Navami Day:- ప్రతీ ఏటా ఉగాది తర్వాత వేసవికాలం ప్రారంభ కాలంలో చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి వేడుకలను భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీరాముడు దశరధుని మొదటి కుమారుడు.. ఆయన అయోధ్యలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.. అందుకే తాను పుట్టిన పవిత్రమైన రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అంతేకాదు శ్రీరాముల వారి కళ్యాణ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి.
స్వామివారు మధ్యాహ్నం సమయంలో జన్మించారని అందుకే ఈ రోజున పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహించాలని పండితులు కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయస్వామి దేవాలయాలు ఈ సమయంలో భక్తులతో కిటకిటలాడుతాయి. నవమి రోజు రామరక్షా స్తోత్రాన్ని పఠించాలి. ఆర్థిక సంపద పెరగాలి అంటే కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి.
ఏదైనా ఆలయంలో కుంకుమ రంగులో ఉన్న జెండాను దానం చేయాలి. పసుపు భోగాన్ని సమర్పించాలి . కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. రామాయణ పారాయణం వల్ల శ్రీరాముని ఆశీస్సులు పొందవచ్చు. తద్వారా ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతుంది. వైవాహిక జీవితం కోసం ఎదురుచూసే వారికి కష్టాల నుండి విముక్తి పొందాలి అంటే గంగాజలాన్ని లేదా ఏదైనా పవిత్ర నాది నీటిని ఒక పాత్రలో తీసుకొని.. “ఓం శ్రీ హ్వీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అంతేకాదు ఆలయాలలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించడం వల్ల ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లవేళలా మీ కుటుంబం పై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
సూర్యాంజనేయం అని ఎందుకు అంటారు..?
for more updates follow this link:-Bigtv