Stock Market : స్టాక్ మార్కెట్లు పట్ట పగ్గాల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఆల్ టైమ్ హైని తాకాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. సెన్సెక్స్ 64 వేలు, నిఫ్టీ 19 వేల మార్కును టచ్ చేశాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడితో వెనక్కి వచ్చినప్పటికీ.. ఆల్ టైం హై నమోదు చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల మద్దతుతో ఇండెక్స్లు పరుగులు పెట్టాయి. రిలయన్స్, HDFC బ్యాంక్ వంటి ప్రధాన షేర్లు ర్యాలీకి అండగా నిలిచాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు లాభపడింది.
ఉదయం సెన్సెక్స్ లాభాల్లో మొదలైంది. రోజంతా అదే ట్రెండ్ కొనసాగింది. మధ్యాహ్నం సెషన్లో 64వేల మార్కును అందుకుంది. అటు నిఫ్టీ 19 వేల మార్క్ దాటింది. చివరకు సెన్సెక్స్ 63 వేల 915 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో 18 వేల 972 పాయింట్ల దగ్గర ముగిసింది.