Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉండడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నారు. ఆసియా-పసిఫిక్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 455 పాయింట్లు నష్టపోయి 59,749 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో 17,766 వద్ద ట్రేడవుతోంది.
ఎల్అండ్టీ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, మారుతీ షేర్లు లాభాల్లో.. ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, కోల్ ఇండియా, పవర్గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.