stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్ధతు చూపుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 61,076 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 18,143 వద్ద ట్రేడవుతోంది.
ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో… భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, యాక్సిక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.