Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాటలో కొనసాగిన సూచీలు.. ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 236.66 పాయింట్లు నష్టపోయి 60621.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.2 పాయింట్ల నష్టంతో 18027.65 వద్ద క్లోస్ అయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.18 వద్ద ఉంది.
టీసీఎస్, రిలయన్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మారుతి, బజాజ్ ఆటో, సన్ఫార్మా, భారతి ఎయిర్టెల్, హీరోమోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, యాక్సిక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.