Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉండడంతో ఇన్వెస్టర్లు కలవరపడుతున్నారు. మాంద్యం భయాలతో పాటు అమెరికాలో చమురు నిల్వలు ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగాయన్న నివేదికలతో చమురు ధరలు దిగొచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 303.17 పాయింట్ల నష్టంతో 60677 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 101.45 పాయింట్లు నష్టపోయి 18016 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 81.62 వద్ద ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో… హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, మెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.