Sri Lakshmi Devi : శ్రీ మహాలక్ష్మి దేవి పాలలోనే పుట్టింది. పాలు లక్ష్మీదేవికి నివాస స్థానం. ఆ కారణం వల్లే పాలను తొక్కకూడదు అంటారు. ఒక చుక్క పాలు తయారు కావడానికి శరీరానికి ఎంతో శక్తి కావాలి. పాలలో ఎంతటి సంపూర్ణ శక్తి ఉందో అందరికి తెలుసు. తాగిన వెంటనే మనిషికి సమకూర్చేది పాలు ఒక్కటే. ద్రవాహారం లోపాలు, ఘనహారం చేప, ఈ రెండు ఆహారాలు అతి వేగంగా శరీరానికి శక్తినిస్తాయి.భగవంతుడికి నైవేద్యంగా అభిషేకాలు చేస్తూ నైవేద్యం సమర్పిస్తుంటాం. మరి అంత గొప్ప విశిష్టత కల్గిన పాలను మనం తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చాలా మంది చెబుతుంటారు.
పాలు అమతృంతో సమానమైనవి. ఏ కారణం వల్లైనా పాలుపు, పెరుగు, నెయ్యి, వృధా చేయడం పాపము. అందుకే మన పెద్దలు జీవన్నోత్తికి కారణమైన ఆవు, మేక, గుర్రం, మూడింటిని చేతితో అదలించాలే గానీ, కర్రతో కొట్టడం మహా పాపమని వేదాలు చెబుతున్నాయి. ఆవుని, మేకనీ, గుర్రాన్ని కొట్టకూడదు. మానవ జాతి వికాసానికి తోడుగా ఉన్న ప్రాణులు ఇవే. మనిషి తన మేధాశక్తితో తెలివితో సృష్టించలేనివి పాలు. పాలను కృత్రిమంగా ఏ మేథావీ సృష్టించలేం. పాలలోని గొప్పదనం అదే. ఏ మాతృమూర్తి అయినా తన చేతితో గ్లాసుడు పాలు ఇచ్చిందంటే ఆమె మను సొంత తల్లితో సమానమే. పాలు సమృద్ధిగా ఉన్న ఇంటిని శనీశ్వరుడు తన కడగంటినైన చూడడట. పాల వాసన ఉన్న ఇంటికి దరిద్ర దేవత రాదట.
శిశువుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగాలి. కానీ ఆయుర్వేదం ప్రకారం ఏదైనా శారీరక సమస్యలుంటే పాలు తాగకూడదు. ఆరోగ్యానికి పాలు చాలా మంచివి . వాటిలో క్యాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం, విటమిన్ ఎ, డి, ఇ మొదలైనవి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలకు బలం చేకూరుతుంది.