Space Tourism:టూరిజంకు ఈ రోజుల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడెక్కడో ఉన్న టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లడానికి, వాటిని ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఈ టూరిజంను ఆదరిస్తున్నారు. అందుకే టూరిజం రంగం భూమి నుండి ఆకాశానికి విస్తరించాలని అనుకుంటోంది. అందుకోసమే స్పేస్ టూరిజం కోసం ప్రభుత్వాలు కూడా పాటుపడుతున్నాయి. దీనికోసమే ఇస్రో ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) స్పేస్ టూరిజం మాడ్యూల్ను డెవలప్ చేయనుంది. త్వరలోనే స్పేస్ టూరిజంను అనుభూతి చెందాలనుకుంటున్న వారికి ఇస్రో సాయం చేయనుందని తెలిపింది. 2030 వరకు ఆసక్తి ఉన్నవారు స్పేస్కు వెళ్లవచ్చని చెప్తోంది. అయితే ఈ ట్రిప్ కోసం దాదాపు ఒక మనిషికి రూ.6 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ దీనిపై పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు ఇస్రో. ఈ ప్రయాణం చేపట్టిన ప్రతీ ఒకరు వారికి వారు ఆస్ట్రానాట్స్ అని పిలుచుకోవచ్చని హాస్యంగా అన్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.
ప్రభుత్వం కూడా టూరిజంను పెంపొందించాలని ప్రయత్నంలో ఈ స్పేస్ టూరిజం ఒక భాగ్యమని తెలుస్తోంది. అందుకే ఈ టూరిజం గురించి సంబంధించిన ప్రైజ్లు గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయని ఇస్రో తెలిపింది. ప్రస్తుతం దీనికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రయాణంలో స్పేస్ మొత్తం రౌండ్ వేస్తారా లేదా సగం స్పేస్నే కవర్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రూ.6 కోట్ల ఖర్చుతో కేవలం సగం స్పేస్ను మాత్రమే కవర్ చేయవచ్చని ప్రజలు అంచనా వేస్తున్నారు.
Insomnia Problems : నిద్రలేమి సమస్యలను దూరం చేసే స్మార్ట్ ఫోన్స్..
MLC Elections : వైసీపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జోష్..