EPAPER

Survey: ఐటీ ఉద్యోగులూ బీఅలర్ట్.. సర్వేలో షాకింగ్ న్యూస్..

Survey: ఐటీ ఉద్యోగులూ బీఅలర్ట్.. సర్వేలో షాకింగ్ న్యూస్..
it employees

Survey: జాతీయ పోషకాహార సంస్థ.. ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యంపై ఆందోళనను వ్యక్తం చేసింది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడంతో అనేక రోగాల బారిన పడుతున్నారని హెచ్చరించింది. హైదరాబాద్‌ లోని ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేసిన సంస్థ.. 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేల్చింది.


ఐటీ రంగంలో పని చేస్తున్న ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. 35 ఏళ్ల లోపున్నవారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే ప్రమాదంలో ఉన్నారు. 30 సంవత్సరాల వయస్సు పైబడిన ఉద్యోగుల్లో ఆరోగ్య సమస్యలు మరింతగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం, తరచూ బయట తినడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.


ఐటీ కంపెనీల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అవసరమని జాతీయ పోషకాహార సంస్థ స్పష్టం చేసింది. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ఈ కేంద్రాలు పని చేయాలంది.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×