SATHYANARAYANA VATHRAM : మన తెలుగు నాట ప్రతీ ఇంట్లోను జరుగుతున్న ఆచార వ్యవహారాల్లో రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం అంతర్భాగంగా మారింది. సుమారు 750 ఏళ్లుగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మనం జరుగుతూ వస్తుంది. వేల ఏళ్ల నాడు క్రితమే ఈ వ్రతం ఆచరించిన సందర్భాలున్నాయి. కానీ అప్పుడు జరిగిన విధానం ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. స్కంధపురాణంలో కూడా సత్యనారాయణ స్వామి వత్రం ప్రస్తావన ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఉన్నంతలో అందరూ ఆచరించే వ్రతం ఏదైనా ఉందంటే ఇదొక్కటే.
కష్టాలు, నష్టాలు, బాధల నుండి బయట పడేసే శక్తి సత్యనారాయణ వ్రతానికి ఉంది. అందుకే ఈ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. సాధాణంగా ఈ వ్రతాన్ని కార్తీకమాసంలో ఎక్కువగా జరుపుకుంటారు.ముఖ్యంగా కొత్తగా పెళ్లైయి మొదటిసారిగా అత్తవారింట అడుగు పెట్టాక మొదట ఈ వ్రతాన్ని చేయించటం అనాదిగా ఆచారం ఉంది. త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి భూమిపై ఆవిర్భవించారని అసాధారణమైన శక్తిని కలిగిన ఉన్నారని భక్తుల విశ్వాసం .కొత్తగా పెళ్ళైన దంపతులు వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని స్వామిని వేడుకుంటూ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.
ఈ వ్రతం చేసుకొనే సమయంలో బంధువుల్ని, చుట్టుపక్కల వారిని అందరిని పిలుస్తారు.ఆ సమయంలో కొత్త కోడలిని చూసినట్టు అవుతుంది.కొత్త కోడలికి కూడా ఆ ఊరి వారు అందరూ తెలుస్తారన్న ఉదేశం కూడా దీని వెనక కారణం దాగి ఉంది. కొత్త వారి మధ్య వ్రతం జరగడం వల్ల కోడలికి బెరుకు పోయి తొందరగా అందరిలోను కలిసిపోతుంది. ఈ వ్రతం సమయంలో తమ కోడలిని అందరికి పరిచయం చేయటం అత్తింటి కుటుంబం శుభ సూచకంగా భావిస్తుంది.