RBI On EMI missing : పొరపాటున ఈఎంఐ మిస్ అయితే చాలు.. బ్యాంకులు ఇష్టమొచ్చిన పెనాల్టీ విధిస్తుంటాయి. కస్టమర్ల నుంచి వడ్డీ దండుకోవాలనే కోణంలోంచి ఆలోచిస్తుంటాయి. దీంతో బ్యాంకుల ఇష్టారీతి జరిమానాలపై ఆర్భీఐ ఫైర్ అవుతోంది. దీనికోసం కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై అభిప్రాయాలు చెప్పాలంటూ మే 15 వరకు గడువు ఇచ్చింది.
లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లింపులో డిఫాల్ట్ అయినా, లోన్ అమౌంట్ వాడుకోవడంలో నిబంధనలు పాటించకపోయినా.. వడ్డీ రేట్లపై పెనాల్టీ వడ్డీ రేట్లను విధిస్తున్నాయి బ్యాంకులు. ఈ తరహా పెనాల్టీలను ఆదాయాన్ని పెంచుకునే సాధనంగా అధిక వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్నాయి. దీంతో ఆర్ఈలు అదనపు వడ్డీ రేటును విధించరాదని తెలిపింది.
అకౌంట్ హోల్డర్ డిఫాల్ట్ కావడం లేదా లోన్ కాంట్రాక్ట్ కండీషన్స్ పాటించకపోతే గనక.. వాటిని అపరాధ చార్జీలుగానే పరిగణించాలి తప్ప వడ్డీగా వసూలు చేయకూడదని తెలిపింది. పైగా ఇప్పుడు విధిస్తున్న పెనాల్టీ చార్జీలపై మళ్లీ వడ్డీ వేయకూడదనేది ప్రధాన నిబంధన.
అకౌంట్ హోల్డర్లకు ఆర్ఈలు వాయిదా చెల్లింపుల రిమైండర్లు పంపించేటప్పుడు పెనాల్టీ చార్జీలను సైతం తెలియజేయాలి. ఈ ముసాయిదా మార్గదర్శకాలు క్రెడిట్ కార్డ్లకు వర్తించవని, లోన్లకు మాత్రమే పరిమితం అని ఆర్బీఐ స్పష్టం చేసింది.