Ramadasu: కవిగా, సామాజిక సంస్కర్తగా, తాత్వికునిగా, అన్నింటికీ మించి గొప్ప రామభక్తుడిగా కబీర్ దాస్కు ఉన్న పేరు ప్రఖ్యాతులు మనకు తెలుసు. ఆయనకు రామదాస్ అనే శిష్యుడు ఉండేవాడు. గురువుకు సేవలు చేస్తూ.. ఆయన మార్గంలో జీవిస్తూ ఉండేవాడు.
ఒకరోజు రామదాస్… గురువైన కబీర్ వద్దకు వచ్చి.. ‘గురుదేవా! మీరు మహనీయులు. అద్భుతాలు చేయగలరు. దయచేసి నాకు ఒకసారి దేవుడిని చూపించండి’ అని వేడుకున్నాడు.
కబీర్ కొద్ది సేపు ఆలోచించి… ‘రెండు రోజుల తరువాత నేను నీకు దేవుణ్ణి చూపిస్తాను. ఆ రోజున ఊరందరికీ విందు ఏర్పాటు చెయ్యి’ అని చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆ రోజున రామదాస్ ఇంటిలో విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సంగతి తెలిసి ఊరి జనమంతా.. తామూ దేవుడిని చూడొచ్చంటూ పిల్లాపాపలతో తరలి వచ్చారు. మధ్యాహ్నం అయింది. అందరికీ బాగా ఆకలి వేస్తోంది. దేవుడు సంగతి అలా ఉంచితే.. ఆయనను చూపిస్తానన్న కబీర్ జాడ లేదు.
మరొక గంట గడిచేసరికి జనంలో అసహనం ప్రారంభమైంది. అయితే.. తాము ఇంటికి పోగానే దేవుడు వస్తే.. తాము మంచి ఛాన్స్ మిస్ అవుతామే అనుకుంటూ.. ఓపికగా కూర్చొండిపోయారు.
మధ్యాహ్నం మూడు గంటలయ్యే సరికి ఆ ఎండకు ఆకలి, దాహం, మరొకవైపు కబీర్ రాకపోవటంతో జనం కబీర్ను నిందించటం మొదలుపెట్టారు.
ఇంతలో… వంట గదిలోంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. అందరూ అటు వెళ్ళి చూశారు. ఒక గేదె.. వంటింట్లోని వంటకాలన్నీ తొక్కి నేలపాలు చేసి, ఆ బురద నోటితోనే దేవుడికి నైవేద్యంగా చేసిన హల్వాను తింటూ కనిపించింది.
దీంతో అప్పటికే ఆకలి, అసహనంగా ఉన్న రామదాస్.. గేదెను ఓ కర్రతీసుకొని బాదిపారేశాడు. ఆయనకు జనం కూడా తోడుకావటంతో ఆ గేదె ఒళ్లంతా వాతలు పడి నెత్తురోడిపోయింది.
దీనికంతా కబీరే కారణమంటూ జనం అరుస్తూ.. దాని వెంటపడగా అది సమీపంలోని ఓ తోటలోకి పరుగులెత్తగా జనమంతా దానివెంట పడ్డారు.
ఆ తోటలో ఒకచోట కబీర్… ఆ గేదెను పట్టుకొని ‘ప్రభూ! నాడు రావణాసురుడితో యుద్ధంలోనూ నీకు ఇన్ని గాయాలు కాలేదే..! ఇంత బాధను నువ్వు ఎలా భరిస్తున్నావు స్వామీ’ అంటూ కన్నీరు కార్చుతూ.. ఆ గేదె ఒళ్లంతా నెమురుతూ కనిపించాడు.
ఇది చూసిన రామదాస్, ఊరి జనం మనసును కరిగిపోయి.. వారంతా కన్నీరు పెట్టటం ప్రారంభించారు. మురికిగా ఉన్న గేదెలోనూ పరమాత్మను చూస్తున్న కబీరు ఎంత గొప్పవాడో వారికి అర్థమయింది.
‘దైవాన్ని ఈ రూపంలో చూపించారా స్వామీ’ అంటూ రామ్దాస్, జనం కన్నీటి పర్యంతమయ్యాడు. హృదయద్వారాలు తెరిచి చూస్తే.. ఆ పరమాత్మను ఎక్కడైనా చూడొచ్చని వారందరూ తెలుసుకున్నారు.దేవుడు ఎక్కడ లేడు..!?
కవిగా, సామాజిక సంస్కర్తగా, తాత్వికునిగా, అన్నింటికీ మించి గొప్ప రామభక్తుడిగా కబీర్ దాస్కు ఉన్న పేరు ప్రఖ్యాతులు మనకు తెలుసు. ఆయనకు రామదాస్ అనే శిష్యుడు ఉండేవాడు. గురువుకు సేవలు చేస్తూ.. ఆయన మార్గంలో జీవిస్తూ ఉండేవాడు.
ఒకరోజు రామదాస్… గురువైన కబీర్ వద్దకు వచ్చి.. ‘గురుదేవా! మీరు మహనీయులు. అద్భుతాలు చేయగలరు. దయచేసి నాకు ఒకసారి దేవుడిని చూపించండి’ అని వేడుకున్నాడు.
కబీర్ కొద్ది సేపు ఆలోచించి… ‘రెండు రోజుల తరువాత నేను నీకు దేవుణ్ణి చూపిస్తాను. ఆ రోజున ఊరందరికీ విందు ఏర్పాటు చెయ్యి’ అని చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆ రోజున రామదాస్ ఇంటిలో విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సంగతి తెలిసి ఊరి జనమంతా.. తామూ దేవుడిని చూడొచ్చంటూ పిల్లాపాపలతో తరలి వచ్చారు. మధ్యాహ్నం అయింది. అందరికీ బాగా ఆకలి వేస్తోంది. దేవుడు సంగతి అలా ఉంచితే.. ఆయనను చూపిస్తానన్న కబీర్ జాడ లేదు.
మరొక గంట గడిచేసరికి జనంలో అసహనం ప్రారంభమైంది. అయితే.. తాము ఇంటికి పోగానే దేవుడు వస్తే.. తాము మంచి ఛాన్స్ మిస్ అవుతామే అనుకుంటూ.. ఓపికగా కూర్చొండిపోయారు.
మధ్యాహ్నం మూడు గంటలయ్యే సరికి ఆ ఎండకు ఆకలి, దాహం, మరొకవైపు కబీర్ రాకపోవటంతో జనం కబీర్ను నిందించటం మొదలుపెట్టారు.
ఇంతలో… వంట గదిలోంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. అందరూ అటు వెళ్ళి చూశారు. ఒక గేదె.. వంటింట్లోని వంటకాలన్నీ తొక్కి నేలపాలు చేసి, ఆ బురద నోటితోనే దేవుడికి నైవేద్యంగా చేసిన హల్వాను తింటూ కనిపించింది.
దీంతో అప్పటికే ఆకలి, అసహనంగా ఉన్న రామదాస్.. గేదెను ఓ కర్రతీసుకొని బాదిపారేశాడు. ఆయనకు జనం కూడా తోడుకావటంతో ఆ గేదె ఒళ్లంతా వాతలు పడి నెత్తురోడిపోయింది.
దీనికంతా కబీరే కారణమంటూ జనం అరుస్తూ.. దాని వెంటపడగా అది సమీపంలోని ఓ తోటలోకి పరుగులెత్తగా జనమంతా దానివెంట పడ్డారు.
ఆ తోటలో ఒకచోట కబీర్… ఆ గేదెను పట్టుకొని ‘ప్రభూ! నాడు రావణాసురుడితో యుద్ధంలోనూ నీకు ఇన్ని గాయాలు కాలేదే..! ఇంత బాధను నువ్వు ఎలా భరిస్తున్నావు స్వామీ’ అంటూ కన్నీరు కార్చుతూ.. ఆ గేదె ఒళ్లంతా నెమురుతూ కనిపించాడు.
ఇది చూసిన రామదాస్, ఊరి జనం మనసును కరిగిపోయి.. వారంతా కన్నీరు పెట్టటం ప్రారంభించారు. మురికిగా ఉన్న గేదెలోనూ పరమాత్మను చూస్తున్న కబీరు ఎంత గొప్పవాడో వారికి అర్థమయింది.
‘దైవాన్ని ఈ రూపంలో చూపించారా స్వామీ’ అంటూ రామ్దాస్, జనం కన్నీటి పర్యంతమయ్యాడు. హృదయద్వారాలు తెరిచి చూస్తే.. ఆ పరమాత్మను ఎక్కడైనా చూడొచ్చని వారందరూ తెలుసుకున్నారు.దేవుడు ఎక్కడ లేడు..!?
కవిగా, సామాజిక సంస్కర్తగా, తాత్వికునిగా, అన్నింటికీ మించి గొప్ప రామభక్తుడిగా కబీర్ దాస్కు ఉన్న పేరు ప్రఖ్యాతులు మనకు తెలుసు. ఆయనకు రామదాస్ అనే శిష్యుడు ఉండేవాడు. గురువుకు సేవలు చేస్తూ.. ఆయన మార్గంలో జీవిస్తూ ఉండేవాడు.
ఒకరోజు రామదాస్… గురువైన కబీర్ వద్దకు వచ్చి.. ‘గురుదేవా! మీరు మహనీయులు. అద్భుతాలు చేయగలరు. దయచేసి నాకు ఒకసారి దేవుడిని చూపించండి’ అని వేడుకున్నాడు.
కబీర్ కొద్ది సేపు ఆలోచించి… ‘రెండు రోజుల తరువాత నేను నీకు దేవుణ్ణి చూపిస్తాను. ఆ రోజున ఊరందరికీ విందు ఏర్పాటు చెయ్యి’ అని చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆ రోజున రామదాస్ ఇంటిలో విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సంగతి తెలిసి ఊరి జనమంతా.. తామూ దేవుడిని చూడొచ్చంటూ పిల్లాపాపలతో తరలి వచ్చారు. మధ్యాహ్నం అయింది. అందరికీ బాగా ఆకలి వేస్తోంది. దేవుడు సంగతి అలా ఉంచితే.. ఆయనను చూపిస్తానన్న కబీర్ జాడ లేదు.
మరొక గంట గడిచేసరికి జనంలో అసహనం ప్రారంభమైంది. అయితే.. తాము ఇంటికి పోగానే దేవుడు వస్తే.. తాము మంచి ఛాన్స్ మిస్ అవుతామే అనుకుంటూ.. ఓపికగా కూర్చొండిపోయారు.
మధ్యాహ్నం మూడు గంటలయ్యే సరికి ఆ ఎండకు ఆకలి, దాహం, మరొకవైపు కబీర్ రాకపోవటంతో జనం కబీర్ను నిందించటం మొదలుపెట్టారు.
ఇంతలో… వంట గదిలోంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. అందరూ అటు వెళ్ళి చూశారు. ఒక గేదె.. వంటింట్లోని వంటకాలన్నీ తొక్కి నేలపాలు చేసి, ఆ బురద నోటితోనే దేవుడికి నైవేద్యంగా చేసిన హల్వాను తింటూ కనిపించింది.
దీంతో అప్పటికే ఆకలి, అసహనంగా ఉన్న రామదాస్.. గేదెను ఓ కర్రతీసుకొని బాదిపారేశాడు. ఆయనకు జనం కూడా తోడుకావటంతో ఆ గేదె ఒళ్లంతా వాతలు పడి నెత్తురోడిపోయింది.
దీనికంతా కబీరే కారణమంటూ జనం అరుస్తూ.. దాని వెంటపడగా అది సమీపంలోని ఓ తోటలోకి పరుగులెత్తగా జనమంతా దానివెంట పడ్డారు.
ఆ తోటలో ఒకచోట కబీర్… ఆ గేదెను పట్టుకొని ‘ప్రభూ! నాడు రావణాసురుడితో యుద్ధంలోనూ నీకు ఇన్ని గాయాలు కాలేదే..! ఇంత బాధను నువ్వు ఎలా భరిస్తున్నావు స్వామీ’ అంటూ కన్నీరు కార్చుతూ.. ఆ గేదె ఒళ్లంతా నెమురుతూ కనిపించాడు.
ఇది చూసిన రామదాస్, ఊరి జనం మనసును కరిగిపోయి.. వారంతా కన్నీరు పెట్టటం ప్రారంభించారు. మురికిగా ఉన్న గేదెలోనూ పరమాత్మను చూస్తున్న కబీరు ఎంత గొప్పవాడో వారికి అర్థమయింది.
‘దైవాన్ని ఈ రూపంలో చూపించారా స్వామీ’ అంటూ రామ్దాస్, జనం కన్నీటి పర్యంతమయ్యాడు. హృదయద్వారాలు తెరిచి చూస్తే.. ఆ పరమాత్మను ఎక్కడైనా చూడొచ్చని వారందరూ తెలుసుకున్నారు.