Jobs : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రైమరీ టీచర్ పోస్టులు 6,414 ఖాళీలున్నాయి. అందులో జనరల్ కేటగిరీకి 2,599, ఓబీసీ- 1,731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్- 641 పోస్టులు కేటాయించారు. సీనియర్ సెకండరీ, డీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్ఈడీ లేదా డిగ్రీ, బీఈడీతోపాటు సీటెట్ పేపర్-1లో అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను కేవీఎస్ వెబ్సైట్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ.1500. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తుకు చేసుకోవడానికి 26.12.2022 వరకు గడువు ఉంది.
ప్రైమరీ టీచర్: 6,414 పోస్టులు (జనరల్ కేటగిరీ- 2,599, ఓబీసీ- 1,731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్- 641)
అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్ఈడీ లేదా డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ పేపర్-1లో అర్హత
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు
ఎంపిక: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు: కేవీఎస్ వెబ్సైట్ ద్వారా
దరఖాస్తు రుసుము: రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022
వెబ్సైట్: https://kvsangathan.nic.in