EPAPER

Online UPI Payments : టెక్నాలజీని తెగ వాడేస్తున్నారుగా… ఆన్ లైన్ పేమెంట్స్ విలువ రూ.12.11 లక్షల కోట్లు…

Online UPI Payments : టెక్నాలజీని తెగ వాడేస్తున్నారుగా… ఆన్ లైన్ పేమెంట్స్ విలువ రూ.12.11 లక్షల కోట్లు…

Online UPI Payments : ఒక్క అక్టోబర్ లోనే రూ.731 కోట్ల గ్రోత్


టీకొట్టుకెళ్లినా.. కూరగాలు, పాలు కొన్నా… నోట్లతో పనేలేదు. చిల్లర లేదనే టెన్షనే అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఫోన్ ఫేనో, గూగుల్ పేనో, పేటిఎం ద్వారానో పేమెంట్ చేసేయొచ్చు. చిన్నచిన్న వ్యాపారులు కూడా ఇంతకుముందులా డబ్బులు అడగడం లేదు. కొనుగోలు పూర్తికాగానే క్యూఆర్ కోడ్ ను ముందర పెడుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ సత్తా ఇది మరి. డిజిటల్ భారత్ తో ఇదంతా సాధ్యమవుతోందని ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. కేంద్రం యూపీఐ పేమెంట్స్ సిస్టం తీసుకొచ్చాక ఆన్ లైన్ పేమెంట్ విపరీతంగా పెరిగాయి. అవి ఎంతగా అంటే ప్రపంచంలోనే భారత్ ను ముందు స్థానంలో నిలబెట్టేటంత. ఒక్క అక్టోబర్ నెలనే తీసుకోండి. ఆ నెలలో రూ.731 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. గతంతో పోల్చితే ఇది 7.7 శాతం ఎక్కువ. ఈ ఒక్క నెల ట్రాన్సక్షన్స్ తో భారత్ లో మొత్తం యూపీఐ లావాదేవీల విలువ రికార్డు స్థాయిలో రూ. 12.11 లక్షల కోట్లకు చేరిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎన్.పి.సీ.ఐ. తెలిపింది.
ఇక సెప్టెంబర్ నెలలో ఆన్ లైన్ యూపీఐ లావాదేవీలు రూ.678 కోట్ల వరకు జరిగాయి. దీంతో సెప్టెంబర్ నెల వరకు మొత్తం యూపీఐ లావాదేవీలు రూ.11.16 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం పెరిగిన డిజిటల్ పేమెంట్స్ లో ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-ఐ.ఎం.పి.ఎస్ లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు. అంటే వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. మరోవైపు సెప్టెంబర్ నెలతో పోల్చితే ఎన్.ఇ.టి.సి. ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్స్ విలువ రూ.4,452 కోట్లకు పెరిగింది.
కరోనా వచ్చినప్పటి నుంచే మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయని చెప్పొచ్చు. నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రచారం జరగగానే జనం యూపీఐ పేమెంట్స్ పై ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. ఫలితంగా నోట్ల వాడకం విపరీతంగా తగ్గింది. డిజిటల్ పేమెంట్స్ ను మరింతగా పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… తాజాగా డిజిటల్ రుపీని తెచ్చింది. అయితే రిటైల్ రంగంలో ఇది అందుబాటులోకి రావడానికి మరో నెల పడుతుంది. ఇక ప్రతి నెల ఒక బిలియన్ అంటే వంద కోట్ల ఆన్ లైన్ లావాదేవీలు జరిగేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. అటు రిజర్వు బ్యాంకు కూడా ఇందుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేసింది. సురక్షితమైన, వేగవంతమైన, సులభమైన పద్దతుల్లో లావాదేవీలు జరిగేలా చూడడం ఇందులో ముఖ్యమైంది.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×