Obesity:టెక్నాలజీ ఎంత పెరిగినా.. కొన్ని ఆరోగ్య సమస్యలకు మందులు కానీ, చికిత్స కానీ ఉండదు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే తగిన చికిత్స. ఈమధ్యకాలంలో అధిక బరువు లేదా తక్కువ బరువు అన్నది కూడా సమస్యగా మారింది. బరువు.. వయసుకు తగినట్టుగా ఉండాలి లేకపోతే ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా లోనయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒబిసిటీకి ఒక కొత్త మెడిసిన్ పరిచయమయ్యింది.
జీఎల్పీ 1 అగోనిస్ట్స్ పేరుతో ఒబిసిటీకి కొత్త మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి బరువు తగ్గడానికి వారికి ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు ఒబిసిటీ కోసం ప్రత్యేకంగా మెడిసిన్స్ అంటూ ఏమీ లేవు. వారికి సరైన డైట్ చికిత్స. వ్యాయామం లాంటివి వారికి బరువు తగ్గించే మరో మార్గంగా ఉండేది. అలాంటి వారికి మెడిసిన్స్ అందుబాటులోకి రావడం మంచి విషయమని పేషెంట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒబిసిటీ అనేది ఇప్పుడు కామన్ సమస్యగా మారింది.
ప్రస్తుతం పరిశోధకులు వేస్తున్న అంచనా ప్రకారం.. 2035 వరకు ప్రపంచంలోని సగం జనాభా ఒబిసిటీతో బాధపడుతుందని తెలుస్తోంది. ఇది కేవలం బరువు పెరగడానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఒబిసిటీ వల్ల ఇంకెన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే దీనికి ఎన్నో విధాలుగా చికిత్స అందించాలని ప్రయత్నించి వైద్యులు ఫెయిల్ అయ్యారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ మెడిసిన్.. వైద్య రంగంలోనే కొత్త అధ్యాయానానికి పునాదికానుంది.
ఒబిసిటీ అనేది ఒక మహమ్మారిగా మారనుందని పలువురు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఒబిసిటీ అనేది పూర్తిగా శరీరానికి సంబంధించింది మాత్రమే కాకుండా న్యూరోలాజికల్కు కూడా సంబంధించిందని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఒబిసిటీ పేషెంట్లు ఫాలో అవుతున్న మోడర్న్ డైట్ చాలావరకు ఉపయోగపడుతుంది కానీ కొత్తగా తయారు చేసిన జీఎల్పీ 1 అగోనిస్ట్స్ మరింత ఉపయోగకరంగా మారనుందని వైద్యులు హామీ ఇస్తున్నారు.
Space : స్పేస్లో ఉన్న చెత్త.. భూభాగానికి హానికరం..!
Kakinada : ఫైన్ కట్టమంటే నరికేశాడు.. కాకినాడలో దారుణం..