Maruti Electric SUV Cars : పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా ఎంతో పోటీని తట్టుకొని మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఎవరు ఎంత విమర్శించినా కూడా పాత పద్ధతులను మార్చుకోకుండా వాటితోనే కస్టమర్లను ఇంప్రెస్ చేస్తున్నారు. కానీ రోజులు మారాయి. ట్రెండ్కు తగినట్టుగా కస్టమర్ల ఇష్టాలు కూడా మారుతుండడంతో ఆటోమొబైల్ సంస్థలు కూడా కస్టమర్లను ఇంప్రెస్ చేయడం కోసం వాటి పద్ధతులను మార్చుకుంటున్నాయి. అందులో మారుతీ సుజుకీ కూడా ఒకటి.
మారుతీ సుజుకీ మోడల్ అంటే చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. కస్టమర్ల ఇష్టాలకు తగినట్టు, ట్రెండ్ మారుతున్నకొద్దీ ఎన్నో కొత్త రకాల మోడల్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది మారుతీ. గత కొన్నేళ్లలో మారుతీ ఎస్యూవీ మోడల్కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఎస్యూవీకి సంబంధించిన మొదటి ఎలక్ట్రిక్ కారు గురించి కొత్త అప్డేట్ బయటికొచ్చింది. ప్రస్తుతం ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ప్రోటోటైప్ టెస్టింగ్ దశలో ఉండగా.. ఇది అయిపోగానే ఫైనల్ ప్రొడక్షన్ ఉంటుందని, దాని తర్వాత లాంచ్కు సిద్ధమవుతుందని యాజమాన్యం తెలిపింది.
ఎస్యూవీ అంటే స్టైల్కు, కంఫర్ట్కు పెట్టింది పేరు. ఇక ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో కూడా స్టైల్కు, కంఫర్ట్కు ఏ మాత్రం లోటు ఉండదని యాజమాన్యం హామీ ఇస్తోంది. మామూలుగా ఇతర మారుతీ కార్లలో ఉండని ట్విన్ స్క్రీన్స్ లాంటి ఎన్నో కొత్త ఫీచర్స్ ఈ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఉండనున్నాయి. హెడ్ల్యాంప్స్, వీల్ ఆర్చెస్ విషయంలో కూడా స్టైలింగ్ను మార్చి మరింత అల్ట్రా స్టైలిష్గా ఈ ఈవీక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలు సిద్ధం కానున్నాయి.
టెక్నాలజీల విషయంలో కూడా ఈవీఎక్స్ ఏ మాత్రం తగ్గడం లేదని మారుతీ అంటోంది. పానరోమిక్ సన్రూఫ్ లాంటి ఎన్నో టెక్నాలజీలో ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో 60కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండగా.. 550 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఈవీఎక్స్ ఇంకా మార్కెట్లోకి రాకపోయినా దీని ప్రైజ్ మాత్రం రూ.20 నుండి 25 లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని పలువురు మారుతీ రెగ్యులర్ కస్టమర్లు ఎదురుచూస్తున్నారు.