Maida Flour : ప్రస్తుతకాలంలో అందరూ అన్నానికి బదులుగా చపాతీలు, పరోటాలు, రోటీలు తింటుంటారు. అవి గోధుమ పిండితో తయారైనవి అయితే పర్వాలేదు కానీ మైదాపిండితో చేసినవి అయితే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు. మైదా పిండి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మైదా పిండి మెత్తదనం, తెల్లదనం కోసం ఎక్కువగా పాలిష్ చేస్తారు. క్లోరైడ్ గ్యాస్, బెంజయిల్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్ కలుపుతారు. మైదాలో అల్లోక్సాన్ అనే విష రసాయనం కూడా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో ఖచ్చితంగా కొంత పీచు పదార్థం ఉండాలి. అయితే మైదాలో పీచుపదార్థం అస్సలు ఉండదు. దాంతో త్వరగా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుంటుంది. పేగుల్లో పుండ్లు కూడా పడే ప్రమాదం ఉంది. పుండ్లు ముదిరి క్యాన్సర్లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. మైదా పిండిని ఎక్కువగా గోడలకు పోస్టర్లను అంటించడానికి వాడుతారు. మైదాలోని జిగురు పోస్టర్లు గోడకు అంటుకునేలా చేస్తుంది. మైదా పదార్థాలను తిన్నప్పుడు మన పేగులకు కూడా అలాగే అతుక్కుపోతాయి. క్రిములు వచ్చి ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయి. మైదా వల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా వస్తాయి. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మహిళలల్లో బ్రెస్ట్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. మైదాలో కేవలం పిండి పదార్థమే ఉండడం వల్ల పొట్ట పెరుగుతుంది.