Anand Mahindra: దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్ వ్యవహారం సంచలనంగా మారింది. హిండెన్బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. పార్లమెంట్ను కూడా అదానీ గ్రూప్ వ్యవహారం కుదిపేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.
తన ట్విట్టర్ ఖాతాలో ‘‘ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఉండాలని భావిస్తోంది. ఆ ఆశయాలను ప్రస్తుతం వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా.. అని అంతర్జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. నా జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులు, కరువుకాటకాలను చూశాను. వాటిని చూసిన అనుభవంతో చెప్తున్నా…. ఎప్పుడూ భారత్కు సవాల్ విసరకండి’’ అంటా రాసుకొచ్చారు. పరోక్షంగా అదానీ గ్రూప్నకు మద్ధతు ఇచ్చారు.