Spiritual Stories : దేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించారు. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే… మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. పాపశానంలో వచ్చే నీరు కొండల్లోంచి సహజసిద్ధంగా వచ్చే జలధార ఇది. ఈ జలాల్లో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే దీనికి పాపనాశనం తీర్థమనే పేరు స్థిరపడింది.
తెలిసీ చేసినా, తెలియక చేసినా సమస్త పాపాలు పశ్చాతాపంతో మూడు రోజులు స్నానమాచరించిన సమస్త దోషాలు పోతాయని శ్రీవెంకటేశ్వర మహత్మ్యంలో ఉంది. చిత్తా నక్షత్రాన చైత్ర పౌర్ణమి ఉదయం ఆకాశ గంగంలో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ నీటితో కడిగిన మురికిలా పాపాలు పోతాయని విశ్వాసం. భక్తుల నీటి అవసరాల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన డ్యామ్ కూడా చూడవచ్చు. తొలుత పాపవినాశనం తీర్థ జలాలను స్వామి వారికే వినియోగించేవారు. ఆలయానికి దూరంగా ఉండడంతో ప్రస్తుతం ప్రత్యేక దినాల్లోనే ఈ జలాలను తీసుకెళుతున్నారు.
ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోని పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఆకాశ గంగ ఉంది. ఇది కూడా సహజసిద్ధ తీర్థమే. ఈ తీర్థంతో శ్రీవెంకటేశ్వస్వామి వారికి నిత్యాభిషేకం జరుపుతూ ఉంటారు. తిరుమలలోని పవిత్ర తీర్థాల్లో ఇదొకటి. ఇది ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో ఉంది. ఈ ఆకాశగంగ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో ఇప్పటికి తెలియని ఒక అంతుచిక్కని రహస్యం. సహజసిద్దంగా ప్రవహించే ఈ తీర్థం వెనక వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.