Smart devices : తెల్లవారింది మొదలు నిద్రపోయేదాకా సిటీల్లో ఉరుకులు పరుగుల జీవితం. ఉద్యోగులు, వ్యాపారులు ఎవరైనా సరే టార్గెట్లు పూర్తిచేయాలి. ఇదే మనిషిలో తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడికి ఆర్థిక పరమైన అంశాలు కూడా కారణమే. ఈఎంఐలు కట్టాలి. పెరుగుతున్న వడ్డీలు గుదిబండలా మారుతాయి. ధరలు పెరుగుతున్నాయి. జీతాలు పెరగవు… ఒక్కటేమిటి… సవాలక్ష ఉంటాయి. అలాగని ఒత్తిడి అనేది పెద్దలకు మాత్రమే పరిమితం కాలేదు. స్కూలు పిల్లలకూ తప్పదు. హోంవర్క్ పూర్తిచేయాలి, స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్టు వర్కులు కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి… ఇలా ప్రతీది ఒత్తిడి పెంచేదే. మన దేశంలో 89 శాతం మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఇటీవల సిగ్నల్ టీటీకే హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఒత్తిడే అనారోగ్యాలకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. అది అంత ఈజీ కాదు. అయితే ఒత్తిడిని తగ్గించేందుకు మార్కెట్లోకి పలు స్మార్ట్ డివైసెస్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని ధరించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే వీలుంది. మనిషిలో ప్రెజర్ పెరుగుతున్న టైంలో ఈ స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ రింగ్ లు వంటివి అలర్ట్ చేస్తాయి. కాసేపు రిలాక్స్ కావాలంటూ సూచిస్తాయి. అవి పంపే మెసేజ్ లను ఫాలో అయితే… ఒత్తిడి హుష్ కాకియే.
ఒత్తిడిని తగ్గించే కొన్ని పరకారలు ఇవి :
వీటితోపాటు ఒత్తిడిని తగ్గించే మరెన్నో స్మార్ట్ గ్యాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలోని ఫీచర్లను గుర్తించి వాడుకుంటే ఉపయోగం ఉంటుంది.