Special trains for Diwali and Dussehra: రైల్వే ప్రయాణికులు శుభవార్త. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు దసరా, దీపావళి పండుగలకు ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న రైళ్లకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అలాగే అదనపు కోచ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న రైళ్లకు ఈ ఏడాది అదనంగా 12,500 కోచ్లను జత చేస్తున్నామని రైల్వే మంత్రి అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 5,975 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు మంత్రి పేర్కొన్నారు. పండుగ వేళ 108 రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్య పెంచినట్లు తెలిపారు.
దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక రైళ్లకు 12,500 కోచులను అదనంగా జత చేస్తున్నామని పేర్కొన్నారు. 2024-25 ఏడాదిలో తాము తీసుకున్న నిర్ణయంతో దాదాపు కోటిమంది ప్రయాణికులకు సౌకర్యం సులభతరమైందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, దసరా, దీపావళి పండుగలకు చాలా ప్రత్యక స్థానం ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఈ పండుగలను ప్రజలు చాలా విశేషంగా నిర్వహించుకుంటారు. తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుంటూ వేడుకలు చేసుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ శాతం ప్రజలకు ప్రయాణాలు చేస్తుంటారు. అందుకే రైళ్ల సంఖ్యను పెంచుతున్నామని మంత్రి వివరించారు.
Also Read: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!
గతేడాది కంటే ఈ ఏడాది ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచింది. 2023-24 ఏడాదిలో దసరా, దీపావళి పండుగ సీజన్లో 4,429 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు రైల్వే మంత్రి తెలిపారు. అయితే ఈ ఏడాది అదనంగా నడుపుతున్నట్లు తెలిపింది. ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకొని 5,975 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఈ పండగల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.